పల్లవి : రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య || 2 ||
అ . ప :నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య || 2 ||
నీవే లేకుండా నేనుండలేనయ్య
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య || 2 || || రాజా ||
చరణం:నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
ఆరాధించుకొనే విలువైన అవకాశం || 2 ||
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
బాధల నుండి బ్రతికించుటకును || 2 ||
నీవే రాకపోతే నేనేమైపోదునో || 2 || ||నేనుండ ||చరణం:ఒంటరి పోరు నన్ను విసిగించిన
మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా || 2 ||
ఒంటరివాడే వేయి మంది అన్నావు
నేనున్నానులే భయపడకు అన్నావు || 2 ||
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య || 2 || ||నేనుండ ||చరణం:ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా || 2 ||
విశ్వానికి కర్త నీవే నా గమ్యము
నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము || 2 ||
నిన్ను మించిన దేవుడే లేడయ్య || 2 || ||నేనుండ ||
No comments:
Post a Comment